కమలం కచ్చేరి పేల్చివేత

రాంచీ: జార్ఖండ్లో మావోయిస్టులు శనివారం తెల్లవారు జామున సెరైకెలా జిల్లాలోని మాజీ ముఖ్యమంత్రి, భాజపా లోక్సభ అభ్యర్థి అర్జున్ ముండా ఎన్నికల కార్యాలయాన్ని కాల్చివేశారు. సెరైకెలా జిల్లాలోని ఖర్సావన్ పార్టీ కార్యాలయంలోకి ప్రవేశించిన మావోయిస్టు గెరిల్లా దళ సభ్యులు అందులో నిద్రిస్తున్న నలుగురు డ్రైవర్లను బయటకు పంపారు. తర్వాత కార్యాలయంలో పేలుడు పదార్థాల్ని పెట్టి పేల్చేశారు. భవనంలోని చాలా భాగం ధ్వంసమైందని పోలీసులు తెలిపారు. ఎవ్వరూ గాయపడలేదు. గత నెల 26న పలామౌ జిల్లాలోని బీజేపీ కార్యాలయాన్ని కూడా మావోలు పేల్చివేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos