క్షుద్ర పూజల కలకలం

క్షుద్ర పూజల కలకలం

కాకినాడ:పట్టణంలో క్షుద్ర పూజలు కలకలాన్ని రేపాయి. ఇక్కడి గొడారి గుంట, సీతారంపురం సగర సామాజిక భవనంలో ఆదివారం అర్థరాత్రి జరిపిన క్షుద్ర పూజల్ని పోలీసులు అడ్డుకున్నారు. పూజల గురించి స్థానికులు పోలీసులకు సమాచారాన్నిచ్చారు. సగరపేటకు చెందిన కొందరు చిన్నారులు, యువకులు ఇటీవల ఆకస్మికంగా మృత్యువాత పడ్డారు.ఇందుకు గల కారణాల్ని తెలుసుకునేందుకు కొందరు ఒక సిద్ధాంతిని కోరారు. ఆయన సూచనల ప్రకారమే ఆదివారం పూజలు జరిపారు. నెయ్యి కుండలతీ దీపారాధన, పెద్ద ఎత్తున కుంకుమ, కొబ్బరి బొండాలు, మూడు నాటు కోళ్లు తదితర సామాగ్రితో పూజలు చేశారు. వీటిని క్షుద్ర పూజలుగా భావించిన కొందరు స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. పూజలు నిర్వ హించిన ఏడుగిరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నా రు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos