బిట్​ కాయిన్​ ను కరెన్సీగా ప్రకటించిన ఎల్​ సాల్వడార్

బిట్​ కాయిన్​ ను కరెన్సీగా ప్రకటించిన ఎల్​ సాల్వడార్

సాన్ సాల్వడార్ : బిట్ కాయిన్ దేశ కరెన్సీగా నిర్ణయించినట్లు ఎల్ సాల్వడార్ అధ్యక్షుడు నయీబ్ బుకీలి ప్రకటించారు. ప్రకటించింది. బిట్ కాయిన్ ను కరెన్సీగా ప్రక టించిన తొలి దేశం ఇది. జాతీయ కరెన్సీగా డాలర్ నే ఉంచారు. ప్రపంచ బ్యాంకు వద్దన్నా, ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమైనా కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అది దోహదపడుతుందన్నది పాలకుల మదింపు. తాజా నిర్ణయంతో అన్నిదుకాణాలు, వాణిజ్య సంస్థలు బిట్ కాయిన్ ను తీసుకోవాల్సి ఉంటుంది. పన్ను చెల్లింపుల కోసం ప్రభుత్వం కూడా వాటిని ఆమోదిస్తుంది. ‘తాజాగా 200 బిట్ కాయిన్లను కొనుగోలు చేశామని, దీంతో ప్రభుత్వం వద్ద ఉన్న బిట్ కాయిన్ల నిల్వ 400కు చేరింది. రాబోయే రోజుల్లో మరిన్ని కాయిన్లను కొంటాం. మరిందరికి ఆర్థిక స్వావలంబన ఇచ్చేందుకు ఇది దోహదం చేస్తుంది. లావాదేవీలు తక్కువ ఖర్చుతో పూర్తవు తాయ’ని నయీబ్ బుకీలి అన్నారు. దేశవ్యాప్తంగా 200 బిట్ కాయిన్ ఏటీఎంలను ఏర్పాటు చేసారు. అక్కడ బిట్ కాయిన్లను డాలర్లుగా మార్చుకోవచ్చు. అందుకోసం ప్రభుత్వ బ్యాంకులో ఆర్థిక శాఖ సుమారు రూ.1,100 కోట్లు) నిధిని ఏర్పాటు చేసింది. బుకీలిపై ప్రజల్లో మంచి అభిప్రాయం ఉంది. గత వారం నిర్వహించిన సర్వేలో ఆయనకు 80 శాతం మంది ప్రజామోదం లభించింది. బిట్ కాయిన్ బిట్ కాయిన్ చట్టాన్ని రద్దు చేయాలని 66 శాతం మంది, తాము డాలర్ నే వాడుతామని 70 శాతం మంది చెప్పారు. దాని వాడకంపై మరోసారి ఆలోచన చేయాలని ఎల్ సాల్వడార్ కు ఐఎంఎఫ్ సూచించింది. బిట్ కాయిన్ ను కరెన్సీగా ఆమోదించేందుకు సాయం చేయాలన్న ఆ దేశ విజ్ఞప్తిని ప్రపంచ బ్యాంకు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. క్రిప్టోకరెన్సీలో పారదర్శకత లోపించిందని తేల్చి చెప్పింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos