మౌన మేల మోదీ?

మౌన మేల మోదీ?

న్యూ ఢిల్లీ : హత్రాస్ ఘటనపై ప్రధాని మోదీ నోరు విప్పాలని భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ డిమాండ్ చేశారు. దీనిపై తాము శుక్ర వారం సాయంత్రం జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతామని ప్రకటించారు.‘యూపీ నుంచే మోదీ లోక్ సభకు ఎన్నికయ్యారు. హత్రాస్లోనే బాలికపై ఘోరంగా అత్యాచారం చేసి చంపేశారు. ఆమె ఎముకలు విరిగిపోయాయి. ఇంత మానవ హక్కుల ఉల్లంఘన యూపీలో జరుగుతుంటే మోదీ మాట్లాడరా? బాధితురాలి అరుపులు కానీ… వారి కుటుబ సభ్యుల అరుపులు కానీ మోదీ వినడం లేదు. ఇలా ఎన్ని రోజుల పాటు మోదీ మౌనంగా ఉంటారు? కచ్చితంగా సమాధానం ఇవ్వాల్సిందే. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఇండియా గేట్ వద్దకు వస్తున్నాం. మా డిమాండ్లకు సమాధానం ఇవ్వాలి. మీ మౌనం బాలికలకు అపాయం’ అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos