మార్కెట్‌కు లాభాల బోణి

మార్కెట్‌కు లాభాల బోణి

ముంబై: స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ శుక్రవారం లాభాలతో మొదలైంది. ఉదయం 9.40గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 106 పాయింట్ల లాభంతో 39,088 వద్ద, నిఫ్టీ 21 పాయింట్లు లాభపడి 11,746 వద్ద ట్రేడయ్యాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 69.27 వద్ద నమోదైంది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో లాభాల బాట పట్టిన బాంబే డైయింగ్‌ అండ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ కంపెనీ షేర్లు 12 శాతం పెరిగాయి. యస్‌ బ్యాంక్‌, ఐఓసీ, సన్‌ ఫార్మా, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, కోల్‌ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ, ఎన్‌ఎఫ్‌ఎల్‌, ఓరియంట్‌ పేపర్స్‌, టాటా పవర్‌ షేర్లు లాభాల్లో కొనసాగాయి. లారెన్‌ ల్యాబ్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌, ఎల్‌ అండ్‌ టీ, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ కంపెనీల షేర్లు నష్టపోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos