కోస్తా తీరంలో భారీ వర్షాలు

కోస్తా తీరంలో భారీ వర్షాలు

విశాఖ పట్టణం: ఈశాన్య-తూర్పు బంగాళాఖాతాల మధ్య ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల వచ్చే 36 గంటల్లో శ్రీకాకుళం, విజయనగరం, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇక్కడి వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు తెలిపారు. శ్రీశైలం నుంచి దాదాపు 8 లక్షల క్యూసెక్కుల నీరు నదిలోకి వదలటంతో నాగార్జున సాగర్ జలాశయం నెమ్మదిగా నిండుతోంది. గంటకు అడుగు చొప్పున నీటి మట్టం పెరుగుతోంది. దరిమిలా సోమవారం ఉదయం 7.30 ప్రాంతంలో సాగర్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఇప్పటికే జూరాల గేట్లు 66, శ్రీశైలం పది గేట్లు ఎత్తి నదిలోకి నీరు విడుదల చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos