కాషాయం నీడ చేరిన ఆప్‌ ఎమ్మెల్యే

కాషాయం నీడ చేరిన ఆప్‌ ఎమ్మెల్యే

న్యూఢిల్లీ : ‘మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలంటే మీ తాతలు దిగిరావాలి’ అని ఆప్‌ అధ్యడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద కేజ్రీవాల్ శుక్రవారం ఇక్కడ ఎద్దేవా చేసిన కొన్ని గంటల్లోనే ఆప్ విధాన సభ సభ్యుడు అనిల్ బాజ్‌పాయ్, కేంద్రమంత్రి విజయ్ గోయల్ సమక్షంలో (గాంధీనగర్) కాషాయ ధ్వజం నీడలోకి చేరారు.ఇందుకు కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా భాజపాను దునుమాడారు. ఇతర పార్టీల విధానసభ సభ్యుల్ని కొనటమే మీరు చెప్పే ప్రజా స్వామ్యానికి నిజమైన నిర్వచనమా? అని ప్రశ్నించారు. ఇంత మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ఆయన నిలదీశారు. తమ విధానసభ సభ్యులకు తలా రూ.పది కోట్లు వంతున నగదు ఆశ చూపినట్లు ఢిల్లీ ఉప ముఖ మంత్రి మనీశ్ శిషోడియా చేసిన ఆరోపణను విజయ్ గోయల్ ఖండించారు. భాజపాకు ఆ అవసరం లేదన్నారు. ఆప్ పార్టీ వ్యవహారం నచ్చకే ఆ పార్టి ఎమ్మెల్యేలు భాజపాలో చేరడానికి సిద్ధపడుతున్నారని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos