హొసూరు : బాగలూరు పంచాయతీ అధ్యక్షుడు వీడీ. జయరామ్ ప్రజాసేవలో నిమగ్నమయ్యారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జయరామ్ భారీ మెజారిటీతో ఎన్నికయ్యారు. తనపై నమ్మకం ఉంచి గెలిపించిన పంచాయతీ ప్రజల ఆశలను వమ్ము చేయనని, సమస్యలను పరిష్కరిస్తానని ఆయన పదవీ బాధ్యతలు చేపట్టిన రోజు బాగలూరు ప్రజలకు హామీ ఇచ్చారు. అందులో భాగంగా బాగలూరు పట్టణంలో వీధి వీధి తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొని పరిష్కరించే పనిలో పడ్డారు. బాగలూరులో మురికి కాలువల పరిస్థితి దారుణంగా ఉందని ప్రజలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యపై స్పందించిన జయరామ్ మురికి కాల్వలను శుభ్రం చేయించి, కాలువలు లేని ప్రాంతంలో వాటిని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. త్వరలో పనులు కూడా ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.