కౌలాలంపూర్ : మలేసియా బ్యాడ్మింటన్ దిగ్గజం లీ చాంగ్ వీ రిటైర్మెంట్ను ప్రకటించాడు. గురువారం ఆయనిక్కడ విలేకరుల సమావేశంలో కంట తడి పెడుతూ ఈ నిర్ణయాన్ని తెలిపాడు. గత ఏడాది తనకు కేన్సర్ సోకిందని, కనుక వైద్యుల సూచన మేరకు 19 ఏళ్లుగా ఆడుతున్నఈ ఆటను ఇక కొనసాగించలేనని వెల్లడించాడు. ఈ నిర్ణయం ఎంతో కష్టంతో కూడుకున్నదైనా, వేరే అవకాశం లేదని తెలిపాడు. ఇటీవల జపాన్లో వైద్యులకు చూపించినప్పుడు బ్యాడ్మింటన్ ఆడడానికి తన శరీరం సిద్ధంగా లేదని చెప్పారని వెల్లడించారు. కాగా లీ ఇప్పటి వరకు ఒలింపిక్స్లో మూడు వెండి పతకాలు సాధించగా, మరో మూడు సార్లు ప్రపంచ ఛాంపియన్షిప్లో రన్నరప్గా నిలిచాడు.