శ్రీ నగర్ : జమ్మూ-కశ్మీర్ స్థితిగతుల అధ్యయనానికి శనివారం శ్రీనగర్ వెళ్లిన కాంగ్రెస్ నేత రాహుల్గాంధీతో సహా పలువురు విపక్ష నేతలను పోలీ సులు విమానాశ్రయం నుంచే వెనక్కి పంపారు. ఇక్కడ పరిస్థితులు సాధారణంగానే అధికార్లు వారికి వివరించి ఢిల్లీకి పంపారు. రాహుల్ గాంధీ వెంట శ్రీనగర్కు సీపీఐ(ఎం) నేత సీతారాం ఏచూరి, రాష్ట్రీయ జనతా దళ్ నేత మనోజ్ ఝా, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత దినేష్ త్రివేది, డీఎంకే నేత తిరుచ్చి శివ తదితరులు వెళ్లారు.