వెక్కివెక్కి ఏడ్చిన చంద్రబాబు

వెక్కివెక్కి ఏడ్చిన చంద్రబాబు

అమరావతి: ‘…అవమానాలను భరించలేకపోతున్నా. మళ్లీ ముఖ్యమంత్రిగానే శాసనసభలో అడుగుపెడతానంటూ శపథం చేసి వెళ్లిపోయిన తెదేపా నేత చంద్రబాబు నాయుడు పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో వెక్కివెక్కి ఏడ్చారు. రెండు నిమిషాల సేపు మాట్లాడలేక పోయారు. గత రెండున్నరేళ్లుగా తనను వ్యక్తిగతంగా వైసీపీ నేతలు వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘నా భార్యకు రాజకీయాలతో సంబంధం లేనప్పటికీ ఆమెనూ చర్చల్లోకి లాగుతున్నారు. ఆమెకు నా గురించి తప్ప మరో ఆలోచన లేదు. భువనేశ్వరి ఇల్లు దాటి ఎప్పుడూ బయటకు రాలేదు. ఏ సమస్య వచ్చినా, ఎలాంటి సంక్షోభం వచ్చినా ఆమె నాకు అండగా నిలిచారు. మన శాసనసభ గౌరవ సభలా కాకుండా అగౌరవసభలా మారింది. ఒకప్పుడు నాన కింద పని చేసిన ప్రస్తుత స్పీకర్ తమ్మినేని కూడా ఇప్పుడు నాకు మాట్లాడేందుకు మైక్ ఇవ్వడం లేదు. కీలక ప్రకటన చేయాలని చెప్పినా మైక్ ఇవ్వలేదు. తమ్మినేని కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. సభలో ఎన్నో చర్చలు చూశా. ఇంతటి దారుణాలు ఎప్పుడూ చూడలేదు. అధికారంలో ఉన్నప్పుడు నేను ఎవరినీ తిట్టలేదు. ఎందరో గొప్ప నాయకులతో పని చేశా. విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నా హుందాగా ఉండేవాళ్లం. నేను అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు ప్రతి పక్షంపై నీచమైన మాటలు మాట్లాడలేదు. గతంలో రాజశేఖరరెడ్డి కూడా నా గురించి ఒక మాట మట్లాడారని. ఆ తర్వాత మేము కలిసినప్పుడు క్షమాపణ చెప్పారు. టీడీపీ నేతలను, కార్యకర్తలను తిట్టడం వైసీపీకి అలవాటుగా మారింద’ని విమర్శించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos