తమిళస్టార్ హీరో విజయ్పై ఐటీ దాడులు తమిళ చిత్ర పరిశ్రమనే కాదు రాజకీయాల్లో సైతం ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.తన గత చిత్రాల్లో బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై సెటైర్లు,కౌంటర్లు వేశాడనే కక్షతో బీజేపీనే దాడులు చేయించిందంటూ విజయ్ అభిమానులు ఆరోపిస్తున్నారు. తాజాగా తమిళనాడు రాష్ట్రాన్ని కాపాడేది విజయ్ మాత్రమేనని తమిళనాడులో వెలసిన పోస్టర్లు చర్చనీయాంశమయ్యాయి.అయితే అందులో విజయ్ మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్,రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ ఫోటోలను సైతం ముద్రించి ఈ ముగ్గురు మాత్రమే తమిళనాడును రక్షించగలరని పోస్టర్లలో పేర్కొనడం చర్చనీయాంశమైంది. సేవ్ తమిళనాడు పేరుతో ఆ పోస్టర్లు, బ్యానర్లను ముద్రించారు. ప్రత్యేకించి- మధురై జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ బ్యానర్లు వెలిశాయి. `మేము మా రాష్ట్రాన్ని కాపాడుకున్నాం. ఇక మీరు మీ రాష్ట్రాన్ని కాపాడుకోండి..` అని వైఎస్ జగన్, ప్రశాంత్ కిశోర్ సంయుక్తంగా విజయ్ను రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానిస్తున్న అక్షరాలను ఆ పోస్టర్ల మీద ముద్రించారు. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రశాంత్ కిశోర్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. నిన్నటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రశాంత్ కిశోర్ చాణక్యం పని చేసిందని అంటున్నారు.ఇక ఈ బ్యానర్లు విజయ్ను రాజకీయాల్లోకి ఆహ్వానించడానికి ఉద్దేశించిన రూపొందించినవని చర్చించుకుంటున్నారు..