టౌన్టన్ : ప్రపంచ కప్పులో భాగంగా పాకిస్తాన్తో బుధవారం ఇక్కడ జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 307 పరుగులకు ఆలౌటైంది. పాక్ బౌలర్ మహ్మద్ అమిర్ 30 పరుగులిచ్చి అయిదు వికెట్లను పడగొట్టాడు. షాహీన్ రెండు వికెట్లు తీసుకున్నాడు. అంతకు ముందు ఆసీస్ ధాటిగా బ్యాటింగ్ను ప్రారంభించింది. వార్నర్, ఫించ్లు తొలి వికెట్కు 146 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వార్నర్ సెంచరీ చేశాడు. తొలుత ఆసీస్ బ్యాటింగ్ తీరు చూసినప్పుడు సులభంగా 350 పరుగుల మార్కును అధిగమిస్తుందని అందరూ భావించారు. అయితే పాక్ బౌలర్లు అనూహ్యంగా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ను పెవిలియన్ దారి పట్టించడంతో స్కోరు 307 పరుగులకే పరిమితమైంది. టెయిల్ఎండర్స్ కూడా చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోగా, ఆసీస్ ఒక ఓవర్ ఉండగానే ఆలౌట్ కావడం విశేషం.