కాషాయ కండువ కప్పుకున్న కాంగ్రెస్ నేత

కాషాయ కండువ కప్పుకున్న  కాంగ్రెస్ నేత

న్యూ ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జితిన్ ప్రసాద బుధవారం ఇక్కడ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, పార్టీ ప్రతినిధి అనిల్ బలుని సమక్షంలో కాషాయ కండువ కప్పుకున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఉత్తర్ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు జరగనున్న దశలో ప్రసాద భాజపాలో చేరటం ప్రాధాన్యం సంతరించుకుంది. బంగాల్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల బాధ్యుడుగా పని చేసారు. తండ్రి జితేంద్ర ప్రసాద కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ నేత. పార్టీలో విబేధాలు, లోక్సభ ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు ఓటమి పాలవటం పార్టీ మారేందుకు కారణమైనట్లు సమాచారం.2019 లోక్సభ ఎన్నికల్లో పోటీకి జితిన్ ప్రసాదకు టికెట్ లభించలేదు. అప్పుడే భాజపాలో చేరతారని ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. షాజాహన్పుర్ అత్యాచారం కేసులో ప్రభుత్వం బాధ్యత వహించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున ముందుండి పోరాడారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos