కరోనాకు సూర్యరశ్మి మందు

కరోనాకు సూర్యరశ్మి మందు

న్యూ ఢిల్లీ : కరోనా నివారణకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ గురువారం చాలా ‘అద్భుత’మైన సలహాలిచ్చి సార్వత్రిక విమర్శలు ఎదుర్కొంటున్నారు. ‘ప్రజలు 15 నిమిషాల పాటు ఎండలో నిలబడాలి. దీంతో డీ విటమిన్ వస్తుంది. వ్యాధి నిరోధకత పెరుగుతుంది.. కరోనా వంటి వైరస్లను చంపేస్తుంది’ అని ఉచిత సలహా ఇచ్చారు. ‘మీరు ఏ చదువులు చదివారో చెబుతారా?’ అంటూ కొందరు ఎగతాళి చేసారు. ‘ఈ రోజు ప్రధాని జాతినుద్దేశించి ఇవ్వనున్న సందేశంలోనూ ఈ అంశం ఉంటుందేమో!’ అని ఇంకొకరు ఉగతుఎగతాళి చేసారు. ‘ఎండలో నిలబడితే వైరస్లన్నీ చచ్చిపోతే ఇటలీలో ఇదే పని చేసేవారుగా?’ అని మరొకరు ప్రశ్నించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos