తనకు సంబంధం లేకపోయినా భారతదేశ విషయాల్లో వేలుపెడుతూ చివాట్లు తింటూ నవ్వులపాలైన పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్పై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ర్యాలీ చేసిన ముస్లింలపై ఉత్తరప్రదేశ్లో భద్రతబలగాలు దాడికి పాల్పడ్డాయంటూ ఇమ్రాన్ఖాన్ పోస్ట్ చేసిన నకిలీ వీడియోపై ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియోను భారత్లో జరిగినట్టుగా ఇమ్రాన్ తప్పుడు పోస్ట్ చేశారని మండిపడ్డారు.భారత్లో ముస్లింల గురించి బాధ పడడం కంటే ముందు మీ దేశం గురించి ఆలోచించుకోవాలని సూచించారు.భారత ముస్లింలుగా తాము గర్వపడుతున్నామని. తాము ఎప్పటికీ అలాగే ఉంటామని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. పాక్లోని గురుద్వారాపై జరిగిన రాళ్ల దాడిపై స్పందిస్తూ.. సిక్కులకు రక్షణ కల్పించాలని కోరారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు..