హోసూరులో ఇద్దరు దొంగలు అరెస్ట్.

హోసూరులో ఇద్దరు దొంగలు అరెస్ట్.

హోసూరు పట్టణ ప్రాంతంలో ఇళ్ల తాళాలు పగులగొట్టి వరుస చోరీలకు పాల్పడిన తండ్రి కొడుకును పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేసి 82 తులాల బంగారు నగలు స్వాధీనపరచుకొన్నారు. హోసూరు పట్టణ ప్రాంతంలోని అలసనాథం,వెంకటేష్ నగర్ తదితర ప్రాంతాలలో తాళాలు వేసిన ఇళ్లలో వరుసగా చోరీలు జరిగేవి.ఈ సంఘటనలపై స్పందించిన పోలీసులు నిఘా పెట్టి అప్రమత్తమైయ్యారు.ఇదిలా ఉండగా శుక్రవారం సాయంత్రం హోసూరు పట్టణ పోలీసులు హోసూరు తళి రోడ్డులో వాహన తనికీలు నిర్వహిస్తుండగా ఆప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను ఆధువులోకి తీలుకొని విచారించారు.పోలీసుల విచారణలో ఆసక్తికర విషయాలు వేలుగుచూసాయి.పోలీసుల కథనం ప్రకారం అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులు కర్ణాటకరాష్ట్రం కోలార్ ప్రాంతానికి చెందిన ప్రకాష్, అతని కొడుకు ధర్మా అనితెలిసింది. విరిరువురు హోసూరు పట్టణ ప్రాంతంలోని పలు ఇళ్లల్లో వరుస చోరీలకు పాల్పడి సుమారు 20 లక్షల వికువ చేసే 82 తులాల బంగారు నగలను చోరీ చేసినట్లు పోలిసులు తెలిపారు. వరుస చోరీలకు పాల్పడిన తండ్రీకొడుకులపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos