ఉగ్ర శిబిరాలపై భారత సైన్యం పంజా..

ఉగ్ర శిబిరాలపై భారత సైన్యం పంజా..

కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ, ఈ ఉదయం వాస్తవాధీన రేఖ వెంబడి దాడులకు తెగబడి, ఇద్దరు జవాన్లను, ఓ పౌరుడిని బలిగొన్న పాక్ సైన్యానికి భారత జవాన్లు గుణపాఠం చెప్పారు. పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం ఆర్టిలరీ గన్స్ వాడుతూ దాడులు చేసింది.భారత సైన్యం జరిపిన దాడిలో పలు టెర్రర్ క్యాంపులు ధ్వంసమైనట్టు తెలుస్తోంది. భారత భూభాగంలోకి ఉగ్రవాదులను పాకిస్తాన్ ప్రేరేపిస్తున్నందుకు ప్రతీకారంగా భారత సేనలు పీఓకేలో ఉగ్రశిబిరాలే లక్ష్యంగా దాడులు చేపట్టాయని తెలుస్తోంది. నీలం ఘాట్లోని ఉగ్ర శిబిరాలను భారత సైన్యం ఫిరంగులతో టార్గెట్ చేసింది. ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేయడంతో పాటు ఈ ఆపరేషన్లో పది, పదిహేను మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు సమాచారం.సరిహద్దులు దాటకుండానే, ఐదు నుంచి 10 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే గన్స్ ను సైన్యం వాడింది.దాడులపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos