బీజేపీ ఎంపీ ఇంటిపై బాంబుల దాడి

బీజేపీ ఎంపీ ఇంటిపై బాంబుల దాడి

కోల్కతా : ఉత్తర 24 పరగణాల జిల్లా, బారక్పూర్లో బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ నివాసం ప్రధాన ద్వారం వద్ద పై కొందరు దుండగులు బుధవారం తెల్లవారు జామున కొందరు మూడు నాటు బాంబులు విసిరారు. ఈ దాడిలో ఎవ్వరూ గాయపడ లేదు. అర్జున్ సింగ్కు సమాఖ్య ప్రభుత్వం భద్రత కల్పించింది. ఈ సంఘటన జరిగిన వెంటనే పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ఖర్ ట్విట్టర్లో ‘‘పశ్చిమ బెంగాల్లో హింస తగ్గుముఖం పట్టడం లేదు. అర్జున్ సింగ్ నివాసం వద్ద బాంబు పేలుళ్లు శాంతి భద్రతలపై ఆందోళన కలిగి స్తున్నాయి. పశ్చిమ బెంగాల్ పోలీసుల సత్వర చర్యలు ఆశిస్తున్నాన’ ని పేర్కొన్నారు. పోలీసు బలగాలను భారీ సంఖ్యలో ఎంపీ నివాసానికి తరలించారు. నిందితులను గుర్తింపునకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos