చెన్నై : డీఎంకే మంత్రి ఉదయనిధి స్టాలిన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణపై అరణికి చెందిన హిందూ మున్నాని నేత మహేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎంకే జిల్లా చీఫ్ ఏసీ మణి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ చర్య తీసుకున్నారు. ఈ నెల 22న జరిగిన వినాయక చవితి వేడుకల సందర్భంగా మహేష్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు ఆయన క్షమాపణ చెప్పాలని మాత్రమే తాను కోరినట్టు మహేష్ తన వ్యాఖ్యలను సమర్ధించుకున్నారు. వినాయక చవితి వేడుకల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో తాను మాట్లాడుతూ సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు ఆయన క్షమాపణ చెప్పాల్సి ఉందని పేర్కొన్నానని హిందూ మున్నాని నేత వివరణ ఇచ్చారు. సెక్షన్ 302 కింద ఉదయనిధి స్టాలిన్పై చర్యలు చేపట్టాలని తాను డిమాండ్ చేశానని చెప్పారు. ఉదయనిధి తన వ్యాఖ్యల్లో నిర్మూలించాలనే పదం వాడారాని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో పాటు, మతపరమైన మనోభావాలను గాయపరిచారని, ఇరు వర్గాల మధ్య శత్రుత్వం ప్రేరేపించారని మహేష్పై పోలీసులు అభియోగాలు మోపారు.