విద్యుత్ శాఖలో లంచాల్లో ఏపీ టాప్..

విద్యుత్ శాఖలో లంచాల్లో ఏపీ టాప్..

‘ఎలక్ట్రిసిటీ యాక్సెస్‌ ఇన్‌ ఇండియా: బెంచ్‌మార్కింగ్‌ డిస్ట్రిబ్యూషన్‌ యుటిలిటీస్‌’ పేరుతో కేంద్ర విద్యుత్ శాఖ, నీతి ఆయోగ్, రాక్ ఫెల్లర్ ఫౌండేషన్, స్మార్ట్ పవర్ ఇండియా సంయుక్తంగా పది రాష్ట్రాల్లో సర్వే నిర్వహించాయి. ఈ సర్వేలో లంచాలు తీసుకుంటున్న విద్యుత్ ఉద్యోగుల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే తొలిస్థానంలో నిలవడం గమనార్హం. సర్వేలో పాల్గొన్న 57 శాతం మంది వినియోగదారులు తమకు ఇలాంటి పరిస్థితి ఎదురైందని చెప్పినట్లు నివేదిక పేర్కొంది. వినియోగదారులు ఎదుర్కొంటున్న సవాళ్లను చర్చించి, వాటికి పరిష్కార మార్గాలను ఈ నివేదిక సూచించింది.చేసిన పనికి నిర్దేశిత మొత్తం కంటే అదనంగా ఇవ్వాలని విద్యుత్తు ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నట్టు దేశవ్యాప్తంగా గృహ వినియోగదారుల్లో 33% మంది, సంస్థాగత వినియోగదారుల్లో 21%.. మొత్తంగా 32% మంది తెలిపారు. ఈ అదనపు మొత్తం గుజరాత్‌లో అతి తక్కువగా 8 శాతం, ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు, దక్షిణ డిస్కంల పరిధిలో అత్యధికంగా 57 శాతంగా ఉంది’ అని నివేదిక పేర్కొంది.విద్యుత్తు సమస్యలు తెలుసుకోవడానికి 10 రాష్ట్రాల్లోని 25 డిస్కంల పరిధిలో 25,116 మందిని సర్వేచేశారు. అందులో ఆంధ్రప్రదేశ్‌లో 1,809 మంది ఉన్నారు. ఈ అంశంపై వినియోగదారులను చైతన్య పరచడం, అదనపు మొత్తాలను అడిగే సిబ్బందిపై డిస్కింలు చర్యలు తీసుకోవాల్సి ఉందని నీతి ఆయోగ్‌ స్పష్టం చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos