గద్దె పై మన్మోహన్ సింగ్ లేక ఆంటోనీ

గద్దె పై మన్మోహన్ సింగ్ లేక ఆంటోనీ

న్యూ ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ మంత్రి, సీనియర్ నేత ఏకే ఆంటోనీ పేర్లను పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించినట్లు తెలిసింది. మన్మోహన్ సింగ్ తొలి ప్రాధాన్యం. ఆయన నిరాకరిస్తే ఏకే ఆంటోనికి బాధ్యతలు అప్పగించాలని సలహా ఇచ్చినట్లు సమాచారం. సోనియాకు అత్యంత సన్నిహితుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. మన్మోహన్, ఏకే ఆంటోనీలలో అధ్యక్ష బాధ్యతలు ఎవరు చేపట్టినా పూర్తికాలంపాటు వారిని నియమించరన్న ప్రచారమూ జరుగుతోంది. వారికి తాత్కాలికంగానే బాధ్యతలు అప్పచెబుతారని పార్టీ వర్గాల కథనం. కొవిడ్ సంక్షోభం తొలగిపోయిన తర్వాత నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ సర్వ సభ్య సమావేశంలో రాహుల్ గాంధీ పూర్తి స్థాయి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతారని తెలుస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos