హొసూరు: నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు జయంత్యు త్సవాన్ని అభిమానులు శుక్రవారం ఇక్కడ ఘనంగా జరుపు కొన్నారు. పట్టణంలోని జాతి పిత గాంధీ విగ్రహం ఎదుట దివంగత అక్కినేని నాగేశ్వరరావు ఛాయాచిత్ర పటాన్ని ఉంచి పూల హారాలు ఘనంగా నివాళు లర్పించారు. చలన చిత్ర రంగంలో అగ్రగామి నటుల్లో ఒకరైన అక్కినేని నాగేశ్వరరావు తెలుగు వారు గర్వించదగ్గనటులని తెలుగు ప్రముఖుడు కె.ఎస్. గోపాల కృష్ణయ్య కొనియాడారు. తెలుగు భాష, సంస్కృతి, కళలు ఉన్నంత కాలం అక్కినేని నాగేశ్వరరావు తెలుగు వారి హృద యాల్లో నిలిచిపోతారని కొనియాడారు.