ఏనుగు దాడిలో మరో రైతు బలి

ఏనుగు దాడిలో మరో రైతు బలి

హోసూరు : ఏనుగు దాడిలో గత మూడు రోజుల్లో ముగ్గురు మృతి చెందిన సంఘటన తీవ్ర  సంచలనం సృష్టించింది . గత ఆదివారం హోసూరు బేరికే రోడ్డు పులియరిసి గ్రామం వద్ద ఒంటరి ఏనుగు దాడి చేసి ఇద్దరిని చంపేసింది. ఈ సంఘటన మరువక ముందే సూలగిరి సమీపంలోని ఆబిరి గ్రామానికి చెందిన అబ్భయ్య అనే వృద్ధునిపై ఏనుగు దాడి చేసి పొట్టన పెట్టుకుంది. సూలగిరి ప్రాంతంలో ఒంటరి ఏనుగు  సంచరిస్తూ రైతులపై దాడి చేసి చంపేయ్యడం వల్ల అటవీ ప్రాంత రైతులు పొలాల వద్దకు వెళ్లేందుకు జంకుతున్నారు. గత కొద్ది రోజులుగా సూలగిరి అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఒంటరి ఏనుగును దట్టమైన అటవీ ప్రాంతానికి తరిమి వేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నా, అటవీశాఖ అధికారులు పట్టించుకోకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయని సూలగిరి ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos