లాక్‌డౌన్‌తో ఎన్ని ప్రయోజనాలో..

లాక్‌డౌన్‌తో ఎన్ని ప్రయోజనాలో..

కరోనా వైరస్‌ నిర్మూలనలో భాగంగా కఠినమే అయినా తప్పనిసరి పరిస్థితుల్లో ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న లాక్‌డౌన్‌ నిర్ణయంతో వైరస్‌ బారి నుంచి దేశం సురక్షితంగా ఉండడమే కాకుండా మరి కొన్ని ప్రయోజనాలు కూడా చేకూరుతున్నాయి. లాక్ డౌన్ తో కుటుంబ సభ్యులు అంతా ఒక్క చోట చేరుతున్నారు. ఎప్పుడు బిజీగా జీవితాన్ని గడిపే జనాలు లాక్ డౌన్ పుణ్యమా అని కుటుంబ సభ్యుల తో గడుపుతున్నాం అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు కొత్త విషయాలను తెలుసుకుంటున్నాం.. కొత్త కొత్త పనులు నేర్చుకుంటున్నాం అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. సమయంలోనే దేశంలోని మెట్రో నగరాలకు లాక్ డౌన్ వరంగా మారిందంటూ పర్యావరణ నిపుణులు అంటున్నారు.దేశ రాజధాని దిల్లీతో పాటు బెంగళూరు.. ముంబయి.. హైదరాబాద్.. కోల్కత్తా వంటి నగరాల్లో కాలుష్యం ప్రమాధకర స్థాయిలో పెరిగి పోయింది. ఆమద్య దిల్లీ రోడ్లపై మాస్క్ లేకుండా మూడు గంటలు తిరిగితే మృతి చెందడం ఖాయం అంటూ వాతావణ నిపుణులు హెచ్చరించారు. అంతగా కాలుష్యం దిల్లీలో విజృంభించింది. లాక్ డౌన్ కారణంగా అన్ని బంద్ అయ్యాయి. ఫ్యాక్టరీలు వాహనాలు అన్ని కూడా నిలిచి పోవడంతో వాతావరణం పూర్తిగా అదుపులోకి వచ్చిందట.మొన్నటి వరకు గాలిలో కాలుష్యం 150 నుండి 200 శాతం ఉండగా ప్రస్తుతం అది 60 లోపుకు చేరిందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. లాక్ డౌన్ పూర్తి అయ్యేప్పటి వరకు కాలుష్యం శాతం మరింతగా తగ్గుతుందని పర్యావణ ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కరోనా మహమ్మారి ప్రాణ భయంను కలిగిస్తున్నా ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నా కూడా కొన్ని విషయాల్లో మాత్రం మంచే చేస్తుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఇదొక్కటే కాదు దూరదర్శన్‌లో పునఃప్రసారమవుతున్న రామాయణం, మహాభారతం ధారావాహికల వల్ల పాశ్చాత్య సంస్కృతికి బానిసలైన నేటి తరం యువత,భవిష్యత్‌ తరాల పిల్లలకు భారతీయ పురాణాలు,ఇతిహాసాలు,సంస్కృతి,సంప్రదాయాల గురించి తెలియజేసే అవకాశం కూడా దక్కిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos