హొసూరులో అన్నాదురై వర్ధంతి

హొసూరులో అన్నాదురై వర్ధంతి

హొసూరు : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి  అన్నాదొరై 51వ వర్ధంతిని రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన వారు ఘనంగా నిర్వహించారు. కృష్ణగిరి జిల్లా వ్యాప్తంగా ఏడీఎంకే,  డీఎంకే పార్టీల నాయకులు వర్ధంతి వేడుకలను జరిపారు. మాజీ మంత్రి బాలకృష్ణా రెడ్డి అధ్యక్షతన హొసూరు అన్నా నగర్‌లో గల అన్నాదొరై విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకుడు నారాయణ, మాజీ కౌన్సిలర్లు సురేష్, రమేష్, అశోక్ రెడ్డి,  సీ. నారాయణ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నాదురై విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

సూలగిరి బీడీవో కార్యాలయంలో యూనియన్ చైర్‌పర్సన్ లావణ్య హేమానాథ్ అధ్యక్షతన అన్నాదురై చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సూలగిరి బీడీవో బాలాజీ,  జిల్లా కౌన్సిలర్ వెంకటాచలపతి, యూనియన్ కౌన్సిలర్లు, ఏడీఎంకే పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos