తెలుగు బుల్లితెరపై సందడి చేసే యాంకర్ రవిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అగ్గిమీద గుగ్గిలంలా మండి పడుతున్నారు.కొద్ది రోజుల క్రితం పటాస్ అనే షోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను కించపరిచేలా ఓ కంటెస్టంట్ చేసిన స్కిట్ను అభినందిస్తూ రవి ప్రవర్తించిన తీరుపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.మహిధర్ అనే కంటెస్టంట్ చేసిన స్కిట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలను కించపరిచే విధంగా ఉందని మహిధర్ చేసిన స్కిట్ను అభినందిస్తూ యాంకర్ రవి అందుకు మద్దతు పలికేలా ప్రవర్తించాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రోజురోజుకు రవిపై వ్యతిరేకత తీవ్రతరమవుతుండడంతో పరిస్థితి తీవ్రతను గుర్తించిన యాంకర్ రవి వీడియో ద్వారా స్పందించాడు.అందులోతనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా వేర్వేరు కాదని.. రెండు రాష్ట్రాల ప్రజలు సమానమేనని చెప్పారు. గత నెలలో జరిగిన షోలో కంటెస్టంట్ మహిధర్ చేసింది తప్పేనని ఆ విషయాన్ని ‘పటాస్’ కూడా ఒప్పుకుంటుందని నేను కూడా ఒప్పుకుంటున్నానని అన్నారు. ‘మహిధర్’ క్షమాపణలు కూడా చెప్పాడని.. ఆ సమయంలో నేను అతడిని సపోర్ట్ చేయలేదుని యాంకర్ గా అక్కడ అలానే ప్రవర్తించాలని అన్నారు.దయచేసి తనను ఈ వివాదంలోకి లాగకండని రిక్వెస్ట్ చేశారు. ఏపీ సీఎం జగన్ అంటే తనకు ఎంతో అభిమానమని, నెల రోజుల్లో ఆయన్ని కలవబోతున్నట్లు చెప్పారు. అయితే వీడియోలో ఇంత మాట్లాడిన రవి క్షమాపణలు చెప్పకపోవడంతో మరోసారి అతడిపై విరుచుకుపడుతున్నారు.
I love my India, I love my 2 Telugu states!
Dont find my mistake…try understanding! pic.twitter.com/GgEsA0e2xS— Anchor Ravi (@anchorravi_offl) June 15, 2019