సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్గా ఉంటూ ఎప్పుడూ హాట్హాట్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులతో నిత్యం టచ్లో ఉండే యాంకర్,నటి అనసూయ భరద్వాజ కొద్ది రోజులుగా ఫ్యామిలీతో కలసి హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు.తన రొటీన్లైఫ్లో చోటు చేసుకున్న ప్రతీ చిన్న విషయాన్ని కూడా అభిమానులతో పంచుకునే అనసూయ తాజాగా చేసిన ట్వీట్ పలు అనుమానాలకు తావిస్తోంది.విమానయాన సంస్థ స్పైస్ జెట్ నుంచి క్షమాపణలు కోరుతున్నానంటూ అనసూయ చేసిన ట్వీట్పై చర్చ సాగుతోంది.అనసూయ ట్వీట్ వెనుక అంతర్యం ఏమిటో తెలియక ఏదో జరిగి ఉంటుందని అందుకు అలా ట్వీట్ చేసుంటుందని అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.కాగా అనసూయ ట్వీట్పై స్పైస్జెట్ సంస్థ కూడా స్పందించింది.అసలేం జరిగిందనే దానిపై పూర్తి సమాచారం మాకు ఇవ్వండి అంటూ రియాక్ట్ అయింది. ప్రస్తుతం ఈ ఇష్యు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ అనసూయకు స్పైస్ జెట్ కలిగించిన ఇబ్బంది ఏంటా? అని ఆలోచిస్తున్నారంతా. వేసవి సెలవులకని వెళ్లిన అనసూయకు స్పైస్జెట్ సర్వీసుల్లో ఏదో ఇబ్బంది కలిగి ఉండొచ్చని, అందుకే ఆమె క్షమాపణలు కోరుతుందని కొందరి వాదన..