భూ మండలం పై ఎవ్వరి దగ్గర లేని ఆయుధాలను భారత్ ఇస్తాం

భూ మండలం పై ఎవ్వరి  దగ్గర లేని ఆయుధాలను భారత్ ఇస్తాం

అహ్మదాబాద్:‘భూ మండలం మీద అత్యుత్తమం అనదగ్గ సైనిక మారణా యుధాల్ని భారత్కు అందించదలచినట్లు’అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇక్కడి మొతేరా స్టేడియంలో జరిగిన నమస్తే ట్రంప్ కార్యక్రమంలో ప్రసంగించారు.మంగళవారం భారత్ తో మూడు బిలి యన్ డాలర్ల విలువైన రక్షణ ఒప్పందాలను కుదుర్చుకుంటామని ప్రకటించారు.అమెరికా, భారత దేశాలు రెండు అతివాద ఇస్లా మిక్ ఉగ్ర వాదాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇదే రెండు దేశాలను ఏకం చేస్తోందని తెలిపారు.‘నా పరిపాలనలో అమెరికా సైన్యం పూర్తి శక్తి సామ ర్ధ్యాలు ఉపయోగించి రక్త పిపాసులైన ఐఎస్ఐఎస్ నరహంతకులని మట్టుబెట్టాం.ఐఎస్ఐఎస్ అధీనంలోని మొత్తం ప్రాంతం నాశనమైంది.కర్కోటకుడు అల్ బాగ్దాదీ హతమయ్యాడు. ఇక రక్షణ ఒప్పందాల్లో భాగంగా మా మిత్ర దేశం భారత్ కు ఈ భూ మండలం మీద అత్యుత్తమం అనదగ్గ మిలిటరీ పరికరాలను అందించాలనుకుంటున్నాం. మరెవరూ తయారుచేయలనంత గొప్ప ఆయుధాలను మేం తయారుచేశాం.ఇప్పుడు వాటి విషయంలోనే భారత్ తో ఒప్పందం కుదుర్చుకో బోతున్నాం.ప్రతి దేశం తనకు సురక్షితమైన సరిహద్దులు ఉండాలని కోరుకుంటుంది.పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలను రూపుమాపేందుకు పాకిస్థాన్ తో మేం చాలా సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తున్నాం’ అని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos