చండీఘడ్ : పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ మరో 15 రోజుల్లో కొత్త రాజకీయ సక్షాన్ని స్థాపించే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం వైఖరితో విసిగిపోయిన ఆయన పార్టీకీ రాజీనామా చేసారు. 12 మంది కాంగ్రెస్ నాయకులు ఆయనతో మంతనాలు జరుపుతున్నారని సమాచారం. కొందరు రైతు సంఘం నాయ కు ల ను కూడా కలిసే అవకాశం ఉంది వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన తాజా రాజకీయ పరిణామాలతో పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ తీవ్ర సంక్షోభంలో పడింది.