న్యూ ఢిల్లీ : ఇండియా గేట్ వద్ద 50 ఏళ్లుగా ఏకధాటిగా వెలిగిన అమర జవాను జ్యోతి శుక్రవారం జాతీయ యుద్ధ సార్మకం వద్ద ఉన్న జ్యోతిలో కలిసిపోయింది. 1971లో పాకిస్థాన్తో జరిగిన యుద్ధంలో మరణించిన సైనికులకు గుర్తుగా అమర జవాను జ్యోతిని ఏర్పాటు చేశారు. ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాప్ చీఫ్ ఎయిర్ మార్షల్ బలభద్ర రాధాకృష్ణ సారథ్యంలో అమర జవాను జ్యోతిని జాతీయ యుద్ధ స్మారకంలో విలీనం చేసారు.