అంగబలం, అర్థబలంతో ప్రజాస్వామ్యాన్ని మంటగలిపారు

అంగబలం, అర్థబలంతో ప్రజాస్వామ్యాన్ని మంటగలిపారు

న్యూ ఢిల్లీ: దేశంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ ఆళ్వా అన్నారు. ప్రతిపక్ష పార్టీల్లో ఐక్యత కొరవడడం వల్ల ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచే అవకాశం లేకపోయినా తాను వెనకడుగు వేయనని తెలిపారు. ఈ ఎన్నికల్లో ఓటింగ్కు దూరంగా ఉండాలన్న నిర్ణయంపై పునరాలోచించేందుకు తృణ మూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి సమయం ఉందని అభిప్రాయపడ్డారు. ఆమె తాజాగా జాతీయ మీడియాతో పలు విషయాలపై మాట్లాడారు. అవి… ‘దేశంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. కావల్సింది తినలేం, చెప్పాలనుకున్నది చెప్పలేం, కలవాలనుకున్నవారిని కలవలేం. ఇదంతా ఏంటి?’ పార్లమెంట్ సమావేశాల్లో గందరగోళం చాలా దురదృష్టకరం. అధ్యక్ష స్థానాల్లో ఉన్నవారు విపక్షాల డిమాండ్లేంటో తెలుసుకుని, దానిపై చర్చ సాగిస్తే సభ ఎజెండా సక్రమంగా నడుస్తుంది. చర్చలేవీ లేకుండా కేవలం 12 నిమిషాల్లో 22 బిల్లులను ఆమోదించడం సరికాదు. జీఎస్టీ గురించి చర్చించాలని మూడు రోజులుగా అడుగుతున్నారు. పాలు, పెరుగు మీద కూడా జీఎస్టీ వేస్తుంటే దానిపై చర్చించకపోవడం దారుణం. ఇవి ఎగువ సభలోనే ఎక్కువగా ఎందుకు ఉంటున్నాయంటే అక్కడ దిగ్గజాలు ఉంటారు. గతంలో ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడూ అక్కడ చర్చలు జరిగేవి, మాట్లాడే హక్కు ఉండేది. అందరూ వినేవారు. పార్లమెంటు ఉన్నదే చర్చల కోసం కదా మెజారిటీ ఉంటే ఓట్లు వేసు కోమనండి., సభలో మైనారిటీ అభిప్రాయం కూడా వినాలి గానీ, తోసిపారేయకూడదు. గవర్నర్ నిష్పక్షపాతంగా ఉండాలి. ప్రభుత్వాన్ని పని చేయనివ్వాలి. రాజ్భవన్లోకి ప్రవేశించగానే ఒక లక్ష్మణ రేఖ ఉంటుందని గుర్తుంచుకోవాలి. అక్కడ కూర్చుని పార్టీ ప్రతినిధిలా పని చేయకూడదు. అది అనైతికం, రాజ్యాంగవిరుద్ధం.రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలు ఏకగ్రీవం అయితే జాతీయ ఐక్యత ఉంటుందనుకోవచ్చు. అందుకే అధికారపక్షం నాకు మద్దతివ్వాలి. అన్ని పార్టీలతో ముందే చర్చించి ఏకా భిప్రా యా నికి వస్తే బాగానే ఉంటుంది. ప్రస్తుత ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయానికి లెక్కలేదు. కర్నాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్.. ఎక్కడ చూసినా అంగబలం, అర్థబలంతో ప్రజా స్వా మ్యా న్ని మంటగలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos