హైదరాబాద్:పాకిస్థాన్ను ఏకాకి చేయాలనే ఆశయంతోనే భారత్ అమెరికాతో జట్టు కట్టిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిష న్రెడ్డి అన్నారు. మంగళ వారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ట్రంప్ భారత పర్యటనలో ఉండగా ఢిల్లీలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించారని విమర్శించారు. ఒక చేతితో జాతీయ జెండా పట్టుకుని మరో చేతితో రాళ్ళ దాడి చేస్తారా అని ప్రశ్నించారు. రెండు నెలలుగా ఉద్యమాలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం సంయమనం పాటిస్తోందన్నారు.