హోసూరులో పేదల రక్తాన్ని తాగేస్తున్న సర్వేయర్

హోసూరులో పేదల రక్తాన్ని తాగేస్తున్న సర్వేయర్

హోసూరు : ఓ సర్వేయర్ పేదల రక్తాన్ని తాగేస్తున్నాడు. భూ విషయాలపై వెళ్లే రైతుల వద్ద వేలకు వేలు లంచాలు తీసుకొంటూ పేదలను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. హోసూరు తాలుకాఫీసులో పనిచేస్తున్న రాజా హెడ్ సర్వేయర్. ఏ పని చేయాలన్నా డబ్బులు ఇవ్వాల్సిందే. భూముల పట్టా మార్పిడి, భూ కొలతలు నిర్వ హించడానికి వేలకు వేలు లంచాలు ఇవ్వాల్సిందే. లంచాలు ఇచ్చినా సకాలంలో పనులు జరుగుతాయా అంటే అదీ లేదు. ఇలా ప్రజలను మండిస్తూ వారి రక్తాన్ని తాగేస్తున్న సర్వేయర్ రాజాపై విసుగు పుట్టి రైతులు హోసూరు ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. రైతు సంఘ నాయకులు శ్రీరామరెడ్డి నేతృత్వంలో రైతులు సర్వేయర్ పై చర్యలు చేపట్టాలని ఆర్డీవో కార్యాలయంలో డిమాండ్ చేశారు. పేదలను లంచాలు కోసం వేధించే సర్వేయర్ పై చర్యలు చేపట్టకపోతే రైతులందరూ ఏకమై పోరాటాలు తీవ్రతరం చేస్తామని శ్రీరామరెడ్డి హెచ్చరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos