ఆత్మాహుతి దాడులు చేస్తాం. అల్‌కాయిదా

ఆత్మాహుతి దాడులు చేస్తాం. అల్‌కాయిదా

న్యూఢిల్లీ: మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలను ఖండించిన ఉగ్ర సంస్థ ఆల్ కాయిదా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. దేశవ్యాప్తంగా ఆత్మాహుతి దాడులకు పాల్పడనున్నట్లు తెలిపింది. అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని హతమారుస్తామని కుండ బద్దలు కొట్టింది. ఢిల్లీ, ముంబై, యూపీ, గుజరాత్ల్లో దాడులకు దిగుతామని ప్రకటించింది. అందులో ‘‘ మేం, మా పిల్లలు ఒంటినిండా పేలుడు పదార్థాలు చుట్టుకుని వారిని పేల్చేస్తాం. ఢిల్లీ, ముంబై, యూపీ, గుజరాత్ల్లోని కాషాయ ఉగ్రవాదులూ! చనిపోయేందుకు సిద్ధంగా ఉండండి’’ అని హెచ్చరించింది. మరో ఉగ్ర సంస్థ ఎంజీహెచ్ కూడా ముహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యల చేసినందుకుగానూ నూపుర్ శర్మ బేషరతుగా ప్రపంచానికి క్షమాపణ చెప్పాలని లేకుంటే.. ప్రవక్తను అగౌరవపరిచినందుకు ఏం చేయాలో అది చేస్తాం’’ అని టెలిగ్రామ్లో తెలిపింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos