ఆంధ్రప్రదేశ్ అప్రమత్తం

ఆంధ్రప్రదేశ్ అప్రమత్తం

విజయ వాడ: ఉగ్రవాదులు, తీవ్ర వాదులు విరుచుకు పడే ప్రమాదం పొంచి ఉన్నందున అప్రమత్తంగా వ్యవహరించాలని, ముందు జాగ్రత్త చర్యల్ని కట్టుదిట్టంగా చేపట్టాలని పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ ఆర్‌.పి.ఠాకూరు బుధవారం జిల్లాల పోలీసుల యంత్రాంగాల్ని ఆదేశించారు. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల ప్రకారం ఆయన వీడియో సమావేశాన్ని నిర్వహించి భద్రత సూచనలు చేశారు. తీర ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేయాలని, వాహనాలు, హోటళ్లలో తనిఖీలు పెంచాలని కోరారు. ఈస్టర్ పండుగ రోజు శ్రీలంకలో మారణ కాండ సాగించిన ఇస్లామిక్ ఉగ్రవాదుల్లో కొందరు ఉగ్రవాదులు తూత్తికుడి, కన్యాకుమారి ద్వారా భారత్‌లోకి ప్రవేశించారని నిఘా విభాగం దక్షిణాది రాష్ట్రాలను హెచ్చరించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos