రాజమండ్రి: విధానసభ ఎన్నికల్లో ఓడి పోయినంత మాత్రాన నిరాశ పడాల్సిన పని లేదని లోక్సభ మాజీ సభ్యుడు అరుణ్ కుమార్ జనసేనాధిపతి, నటుడు పవన్ కళ్యాణ్కు ధైర్యాన్ని నూరి పోసారు. సోమవారం ఆయన ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. బిఎస్పీ స్థాపనకు కాన్షీరామ్ను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. మనోధైర్యంతో రాజకీయంగా ముందుకు సాగాలని హితవు పలికారు. ‘ఒకప్పుడు కాన్షీరామ్ కూడా గెలవలేదు. అలాగని కుంగిపోలేదు. ఆ తర్వాత గెలిచి పార్టీని నిలబెట్టారు. పవన్ కూడా పోరాడి పార్టీని నిలబెట్టాల’ని సూచించారు. ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ దారుణంగా ఓటమి పాలయ్యారు. పోటీ చేసిన రెండు చోట్లా ఘోరపరాజయం పాలయ్యారు. 140 స్థానాల్లో పోటీ చేయగా కేవలం ఒక్క సీటుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.