.గోవధ వద్దు

.గోవధ వద్దు

గౌహతి : ‘‘హిందువులు మన పూర్వీకులు…గోవధ వద్దు’’ అని అసోం ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధినేత , లోక్సభ సభ్యుడు మౌలానా బద్రుద్దీన్ అజ్మల్ బక్రీద్ సందర్భంగా శుక్రవారం ముస్లింలకు పిలుపు నిచ్చారు. ఈద్-ఉల్-అదా రోజున ‘ఖుర్బానీ’ చేయడం ముస్లింల విధి అని పేర్కొన్నారు. అసోం పశువుల సంరక్షణ చట్టం 2021ని గౌరవించాలని విజ్ఞప్తి చేశారు. హిందువుల మనోభావాలను గౌరవించి ఈద్-ఉల్-అదా సందర్భంగా ఆవులను బలి ఇవ్వవద్దని అసోం ముస్లింలకు విజ్ఞప్తి చేస్తున్నానని పునరుద్ఘాటించారు. ‘‘రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ హిందూ రాజ్య స్థాపనకు ప్రయత్నించడం ద్వారా హిందుస్థాన్ను అంతం చేయాలనుకుంటోంది..హిందూ రాజ్య స్థాపన ఆర్ఎస్ఎస్ వారి కలలో కూడా వాస్తవం కాబోదు’అన్నారు. ‘మీరు ఈద్ రోజున ఆవులను తినకండి. మేం పండుగను హిందూ భాయ్లతో జరుపుకుంటాం. మా పూర్వీకులందరూ హిందువులు. వారు ఇస్లాంలోకి వచ్చారు, ఇతర మతాల మనోభావాలను గౌరవించడమే మా అభిమతం’’ అని విలేకరులతో అన్నారు. ‘‘ముహమ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై ముస్లింలు ప్రతిస్పందించకూడదు. దీనికి బదులుగా, నూపుర్ శర్మ వంటి వారికి దేవుడు బుద్ధి ఇవ్వాలని ప్రార్థించాలి. శిరచ్ఛేదం చేయడం మూర్ఖత్వం’’ అని వివరించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు ఓటు వేయవచ్చన్న వార్తను ఖండించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos