శివసేన ముఖ్యమంత్రి : ఆదిత్య ఠాక్రే

శివసేన ముఖ్యమంత్రి : ఆదిత్య ఠాక్రే

ముంబై : మహారాష్ట్రకు త్వరలో శివసేన నాయకుడే ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ యువనేత ఆదిత్య ఠాక్రే ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి గురువారం నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిత్య ఠాక్రే ముంబైలోని వర్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఠాక్రే కుటుంబం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్న తొలి వ్యక్తి ఈయనే కావడంతో నామినేషన్ ప్రక్రియ పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ ర్యాలీకి శివసేన కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. హోర్డింగులు, జెండాలు చేతబట్టి నినాదాలు చేశారు. నామినేషన్‌కు బయలుదేరే ముందు ఆదిత్య ఠాక్రే తన తాత, శివసేన పార్టీ వ్యవస్థాపకుడైన బాల్ ఠాక్రే చిత్రపటానికి నమస్కరించారు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos