ముంబై : మహారాష్ట్రకు త్వరలో శివసేన నాయకుడే ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ యువనేత ఆదిత్య ఠాక్రే ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి గురువారం నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిత్య ఠాక్రే ముంబైలోని వర్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఠాక్రే కుటుంబం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్న తొలి వ్యక్తి ఈయనే కావడంతో నామినేషన్ ప్రక్రియ పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ ర్యాలీకి శివసేన కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. హోర్డింగులు, జెండాలు చేతబట్టి నినాదాలు చేశారు. నామినేషన్కు బయలుదేరే ముందు ఆదిత్య ఠాక్రే తన తాత, శివసేన పార్టీ వ్యవస్థాపకుడైన బాల్ ఠాక్రే చిత్రపటానికి నమస్కరించారు