కోల్కతా: పశ్చిమబెంగాల్లో హింసను అదుపు చేయాల్సిన బాధ్యత కేవలం కేంద్ర బలగాలదే కాదని, రాష్ట్ర పోలీసులు కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి అన్నారు. బుధ వారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ప్రతీదానికి కేంద్ర బలగాలపై ఆధారపడకూడదన్నారు. ఇటీవల పలువురు మహిళా నేతలపై దాడులు, హింసాత్మక ఘటనలు, బూత్ల లూటీ ని ఖండించారు. రాష్ట్ర పోలీసులు కూడా ఇలాంటివి జరక్కుండా తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.