సిమ్లా : మలయాళ నటి మంజు వారియర్ సురక్షితంగా మనాలి చేరుకున్నారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలిపారు. హిమాచల్ ప్రదేశ్లోని ఛత్రు ప్రాంతంలో దాదాపు ఆరు రోజులు వరదల్లో చిక్కుకున్నామని, బుధవారం రాత్రి బృందంతో పాటు సురక్షితంగా మనాలి చేరుకున్నామని వెల్లడించారు. మమ్మల్ని రక్షించడానికి ప్రయత్నించిన యంత్రాంగానికి ధన్యవాదాలని తెలిపారు. ఈ సందర్భంగా చిత్ర బృందంతో దిగిన ఫొటోను షేర్ చేశారు. ‘కయట్టం’ చిత్రీకరణలో భాగంగా మంజు వారియర్ 35 మంది సభ్యుల బృందంతో కలిసి ఇటీవల హిమాచల్ ప్రదేశ్కు వెళ్లారు. గత కొన్ని రోజులుగా ఆ ప్రాంతాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి.