కోదాడ : సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ శివారులోని కోమరబండ కూడలి వద్ద జాతీయ రహదారిపై బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు టైరు పేలడంతో రహదారిపై పల్టీ కొట్టి మరో రెండు వాహనాలను ఢీ కొట్టింది. ప్రమాద సమయంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఓ బాలుడికి తీవ్ర గాయాలు కావడంతో కోదాడ వైద్యశాలకు తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.