కరోనా రోగులున్న వాహనాలపై రాళ్ల దాడి

కరోనా రోగులున్న వాహనాలపై రాళ్ల దాడి

మొరాదాబాద్: నగరంలో కరోనా రోగుల్ని తరలిస్తున్న అంబులెన్స్పై బుధవారం అల్లరి మూక రాళ్ల దాడి చేసింది. దీంతో ఇద్దరు వైద్య సహాయ సిబ్బంది, పోలీసులు గాయ పడ్డారు. ఒక ఇంటి నుంచి కరోనా రోగిని 108 వ్యానులో తీసుకువెళ్ళగా రెండు పోలీసు వాహనాలు ఆ అంబులెన్స్ను అనుసరించాయి. అప్పుడు ఒక గుంపు వారిపై రాళ్ల దాడికి పాల్పడింది. అంబులెన్స్, పోలీసు వాహనం గాజు పలకలు పగిలి పోయాయి. పోలీసులు, వైద్య సిబ్బంది గాయపడ్డారు. హుటాహుటిన అదనపు పోలీసు బలగాలు అక్కడకు చేరుకుని పరిస్థితిని నియంత్రించారు. ‘ మేము రోగిని అంబులెన్స్లో ఎక్కిస్తుండగా, ఒక గుంపు హఠాత్తుగా రాళ్ల దాడి జరిపింది. డాక్టర్లతో పాటు నేనూ గాయపడ్డాను. ముందస్తు వ్యూహం ప్రకారమే ఈ దాడి జరిగిన’ట్లు అంబులెన్స్ డ్రైవరు తెలిపాడు.

తాజా సమాచారం