దురహంకార పూరిత కేంద్ర ప్రభుత్వం

దురహంకార పూరిత కేంద్ర ప్రభుత్వం

న్యూ ఢిల్లీ: ప్రధాని మోదీ సరిహద్దు ఉద్రిక్తతలపై శుక్రవారం సాయంత్రం నిర్వహించనున్న అఖిలపక్ష సమావేశానికి తమను ఆహ్వానించలేదని ఆప్ ప్రతినిధులు వెల్లడించారు. ‘దిల్లీలో ప్రభుత్వాన్ని నడుపుతూ.. పంజాబ్ రాష్ట్రంలో ప్రధాన ప్రతి పక్షంగా ఉన్న మమ్మల్ని ఆహ్వానించక పోవడం సరి కాద’ని ఆప్ నేత సంజయ్ సింగ్ తప్పుబట్టారు. ‘జాతీయ అత్యవసర పరిస్థితి వంటి సందర్భంలో అన్ని పార్టీలు ఐక్య కావాలి. దురహంకార పూరిత ప్రభుత్వం కేంద్రంలో ఉంది. ప్రస్తుతం ఆమ్ఆద్మీ పార్టీ దిల్లీలో అధికారంలో ఉంది. పంజాబ్లో ప్రధాన ప్రతి పక్షంగా ఉంది. దేశవ్యాప్తంగా నలుగురు ఎంపీలు ఉన్నారు. అయినప్పటికీ సరిహద్దు వివాదం వంటి కీలక అంశంలో భాజపా మా అభిప్రాయాన్ని వినాలని అనుకోవట్లేదు. సమావేశంలో ప్రధాని ఏం చెబుతారనే దానిపై దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంద’ని వ్యాఖ్యానించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos