మహిళ పారిశ్రామిక వేత్త ఆత్మహత్య..

  • In Crime
  • September 13, 2019
  • 182 Views
మహిళ పారిశ్రామిక వేత్త ఆత్మహత్య..

ప్రముఖ మహిళ పారిశ్రామిక వేత్త అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడడం చెన్నై నగరంలో సంచలనం సృష్టించింది.చెన్నై నగరానికి చెందిన లంక లింగం తమిళనాడు రాష్ట్రంలో లాన్స్ టయోటా కార్ల ప్రధాన డీలర్గా వ్యవహరిస్తున్నాడు.కంపెనీకి లంక లింగం మురుగేష్ డైరెక్టర్గా వ్యవహరిస్తుండగా ఆయన భార్య రీటా లింకలింగంకో డైరెక్టర్గా ఉన్నారు.ప్రతి రోజూ ఉదయమే నుంగంబాక్కంలో ఉన్న ఇంటి నుంచి కార్యాలయానికి వెళ్లే రీటా గురువారం ఎంతసేపైనా గది నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం కలిగిన ఇంట్లో పని చేసే వ్యక్తి లంక లింగం మురుగేష్కు సమాచారం అందించాడు.వెంటనే ఇంటికి వచ్చిన లంక లింగం పోలీసులకు సమాచారం అందించగా కొద్ది సేపటికి అక్కడికి చేరుకున్న పోలీసులు తలుపులు విరగ్గొట్టి లోపలికి ప్రవేశించగా రీటా ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.కాగా ఇదే కంపెనీలో ఉని చేస్తున్న ఓ ఉద్యోగిని మందలించే విషయంలో రీతా లంకలింగమ్, ఆమె భర్త లంకలింగమ్ మురుగేష్ మద్య వాగ్వివాదం జరిగిందని సమాచారం.కంపెనీ ఉద్యోగి విషయంలో రీతా లంకలింగమ్, లంకలింగమ్ మురుగేష్ ల మద్య గొడవ తారాస్థాయికి చేరిందని తెలుస్తోంది.గత రాత్రి లంకలింగమ్ మురుగేష్ ఇంటికి రాకుండా హోటల్ లో ఉండిపోయారు.కుటుంబ సమస్యల కారణంతో రీతా లంకలింగమ్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రస్తుతం కార్ల వ్యాపారం మందగించడంతో నష్టాలు వచ్చాయా, అప్పులు ఉన్నాయా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos