మణిక్రాంతి తల కోసం ముమ్మర గాలింపు..

మణిక్రాంతి తల కోసం ముమ్మర గాలింపు..

భర్త చేతిలో దారుణ హత్యకు గురైన వివాహిత మణిక్రాంతి తల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. భార్యపై కక్షతో విజయవాడలో వ్యక్తి కత్తితో దాడి చేసి తల నరికి కాలువలో పడేసిన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది.నాలుగేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఏడాదిన్నర క్రితం తన నుంచి విడిపోవడంతో పాటు పలు కేసులు పెట్టడంతో కక్ష పెంచుకున్న శ్రీకాకుళానికి చెందిన ప్రదీప్‌ ఆదివారం భార్యపై కత్తితో దాడి చేసి తల వేరు చేసి కాలువలో పడేసి పోలీసులకు లొంగిపోయాడు. హత్య తర్వాత భార్య తలను కాలువలో పడేసినట్లు చెప్పాడు.దీంతో మణిక్రాంతి తల కోసం ఏలూరు కాలువలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తీవ్రంగా గాలిస్తున్నారు. అయితే భారీ వర్షాల కారణంగా బుడమేరు కాలువ ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో గాలింపుకు ఆటంకం ఏర్పడింది. ఎన్ని కేసులు పెట్టినా పోలీసులు సరిగా స్పందించలేదని, దీని వల్లనే తన కుమార్తె హత్య జరిగిందని తల్లి లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేసింది. మృతదేహాన్ని కదిలించేందుకు ఒప్పుకోనని తెగేసి చెప్పింది. తన కళ్ల ముందే కుమార్తెను నరికి చంపాడని బోరున విలపించింది. నిందితుడు స్టేషన్కు వచ్చి లొంగిపోలేదని, రక్తపు మరకల దుస్తులతో రోడ్డుపై తిరుగుతున్నట్లు సమాచారం అందడంతో వెళ్లి అరెస్టు చేశామని పోలీసులు చెబుతున్నారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos