శ్రీకాళహస్తి: పెనుబాక గ్రామానికి చెందిన 30 మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమవారం పట్టణ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సమీక్షంలో వైకాపాలో చేరారు. వీరిలో కే రమేష్ నాయుడు,కె చంద్రబాబు,శివలింగయ్య,సుధాకర్, వాసు,గురవయ్య,గున్నయ్య, ప్రభాకర్ నాయుడు,రమణయ్య, మణి, సీ. మణి, దామోదర్, కే ప్రకాష్,కే సతీష్,వి సుబ్రహ్మణ్యం,కె రాంబాబు,టి గురవయ్య,టి సుబ్రమణ్యం,టీ సుందరయ్య తదితరులు ఉన్నారు. ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలకు, ,బియ్యపు మధుసూదన్ రెడ్డి పేదలకు చేస్తున్న సేవలకు ఆకర్షితులై, శ్రీకాళహస్తిని అభివృద్ధి పథంలో నడపడం కోసం అనునిత్యం శ్రమిస్తున్న మధుసూదన్ రెడ్డికి తోడుగా ఉండేందుకు వైకాపాలో చేరినట్లు వారు వివరించారు.