చెన్నై: అన్నాడీఎంకే పార్టీ నిబంధనలను సవరించారు. దీంతో పార్టీ అగ్రనేతలైన పన్నీర్సెల్వం, పళనిస్వామి స్థానాలు మరింత సుస్థిరమయ్యాయి. మరోవైపు దివంగత మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలు వీకే శశికళకు పార్టీలో మనుగడ లేకుండా దారులు మూసివేశారు. పార్టీ సమన్వయకర్త, సంయుక్త సమన్వయ కర్తల ఎన్నికకు ఒకే ఓటు విధానాన్ని తప్పనిసరి చేస్తూ నియమావళిని సవరించారు.