శ్రీనగర్ : జమ్మూ- కశ్మీర్లో ఎవరైనా భూములను కొని, నివాసం ఉండవచ్చు అని కేంద్రం మంగళవారం ప్రకటించింది. వ్యవసాయ భూములు ఇందుకు మినహాయింపు. ఎలాంటి స్థానిక నివాస పత్రాలు చూపించకుండానే భూములను కొనవచ్చని వివరించింది. వ్యవసాయ భూముల్ని వ్యవసాయం చేసే వారు మాత్రమే కొను క్కోవ చ్చని పేర్కొంది. జమ్మూ కశ్మీర్ ప్రాంతేతరులు కూడా అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నది తమ అభి మత మని తెలిపింది. పారిశ్రామిక భూముల్లో పెట్టుబడులు అత్యావశ్యకమని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రకటించారు.