అమరావతి: తనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేశారని, చైనా-భారత్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆయనకు తాను ఓ సలహా ఇచ్చానని తెదేపా అధినేత చంద్ర బాబు నాయుడు ట్వీట్ చేసినట్లు ఓ మార్ఫింగ్ ఫొటో సంచలనమైంది. దీనిపై చంద్ర బాబు నాయుడు మండి పడ్డారు. జగన్తో పాటు ఆయన చుట్టూ ఉండే నేరగాళ్లే ఇటువంటి నకిలీ ఫొటోలు సృష్టించి ఇతరుల ప్రతిష్టను దిగజార్చి, అవమానించే చర్యలకు పాల్పడుతుంటారని దుయ్యబట్టారు.